అసలు విషయం

7, జనవరి 2010, గురువారం
కిషోర్ ఆత్మహత్య చేసుకోవడానికి కొండ అంచుకు చేరుకున్నాడు.....
ఇది చూసిన దేవుడు తన భక్తుడిని కాపాడుకోవాలని ఒక్కసారిగా ప్రత్యక్షం అయ్యాడు...
దేవుడు:: ఆగు నాయనా..! ఎందుకు చనిపోవాలని అనుకుంటున్నావు..?
కిషోర్:: స్వామీ..! నేను ఎన్నో తప్పులు, మరెన్నో పాపాలు, ఇంకెన్నో నేరాలు చేసాను.. ఆ పశ్చాతాపం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను..
దేవుడు:: ఆవేశపడకు నాయనా.. దీనికి ఏదో ఒక పరిష్కారం చూద్దాం..
కిషోర్:: దీనికి ఒక్కటే పరిష్కారం స్వామీ..! నాకు ప్రాయశ్చిత్తం కావాలి.. అందుకు నాకు కష్టాలు కావాలి., కన్నీళ్ళు రావాలి.. బాధలతో నా జీవితంపై నాకే అసహ్యం వేయాలి.. నా జీవితం సర్వనాశనం అయ్యిందని నాలో నేనే కుళ్ళి కుళ్ళి ఏడవాలి.......
దేవుడు (చిరాగ్గా) :: ఏం నాయనా..! నీకు పెళ్ళి కావాలని ఒక్క ముక్కలో ఏడవ్వచ్చు కదా...!!!

కామెంట్‌లు లేవు: