ఒక ప్రముఖ రాజకీయ నాయకుని భార్య చనిపోయి నరకానికి వెళ్ళింది... అక్కడ ఎటువైపు చూసినా కొన్ని వేల గడియారాలు వేళ్ళాడదీయబడి ఉన్నాయి.. ఆమె నేరుగ యమధర్మరాజునే కలిసి అడిగింది..
రాజకీయనాయకుని భార్య:: "స్వామీ..! ఇన్ని గడియారాలు ఎందుకు..? సమయం చూడడానికి ఒకటి సరిపోతుంది కదా.."
యముడు ఆమెకు సందేహ నివృత్తి చెయాలని., "అమ్మా..! అవి గడియారాలు కావు.. అవి భూమిపైన మానవుడు చెప్పే ప్రతీ అసత్యానికి ఒక అంకె చొప్పున తిరుగుతూ ఉంటాయి.."
రాజకీయనాయకుని భార్య:: "మరైతే ఇక్కడ ఒక గడియారం ఒక అంకె తిరిగి ఆగిపొయింది., మరొకటి అసలు తిరగటం లేదు.. "
యముడు:: "చూడమ్మా.. మొదటిది ఒక సంఘసంస్కర్తది. అతను ఒకేఒక సారి అసత్యం పలికాడు. అందువల్ల అతని గడియారం ఒక అంకె తిరిగి ఆగిపోయింది.. రెండవది ఒక సన్యాసిది. అతను అసత్యమే పలుకడు కాబట్టి అది అలా తిరగడం లేదు.. "
రాజకీయనాయకుని భార్య:: "మరైతే నా భర్త గడియారం ఎక్కడ ఉన్నది స్వామీ.?
యముడు:: "అది నా బెడ్ రూం లో ఉన్నది.. ప్రస్తుతం నేను దానిని సీలింగ్ ఫ్యాన్ గా వాడుకుంటున్నాను.."
...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
1 కామెంట్:
:) :)
కామెంట్ను పోస్ట్ చేయండి